హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన హాప్మన్ కప్లో అరుదైన సమరం ఆవిష్కృతమైంది. టెన్నిస్ ప్రపంచంలోనే ఆల్టైమ్ గ్రేట్ స్టార్స్గా వెలుగొందుతున్న రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), సెరెనా విలియమ్స్ (అమెరికా) తొలిసారి కోర్టులో ప్రత్యర్ధులుగా తలపడ్డారు.
మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన ఈ పోరు హాప్మన్ కప్కే హైలైట్గా నిలిచింది. దేశాల మధ్య జరిగిన ఈ టీమ్ ఈవెంట్లో తొలి సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ స్విట్జర్లాండ్ తరఫున ఫెదరర్ 6-4, 6-1తో టియాఫో (అమెరికా)పై విజయం సాధించాడు.
ఆ తర్వాత మహిళల సింగిల్స్లో భాగంగా జరిగిన పోరులో సెరెనా విలియమ్స్ 6-4, 4-6, 6-3తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించడంతో స్కోరు 1-1తో సమం అయింది. ఇక, నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్లో ఫెడరర్-బెన్సిచ్ జంట 4-2, 4-3 (5/3) సెరెనా-టియాఫొ జోడీపై గెలిచింది.
దీంతో ఆరుసార్లు విజేతలుగా నిలిచిన అమెరికా జట్టుపై డిపెండింగ్ ఛాంపియన్స్ స్విట్లర్లాండ్ జట్టు 2-1తో నెగ్గింది. ఈ గేమ్ ముగిసిన అనంతరం ఫెదరర్, సెరెనా తమ స్మార్ట్ఫోన్లతో సెల్ఫీలు దిగారు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్తో పాటు వీరిద్దరూ కలిసి కోర్టులో సందడి చేయడం అక్కడున్న టెన్నిస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
View this post on InstagramOh what a night🎾🔥 @serenawilliams
A post shared by Roger Federer (@rogerfederer) on
ఈ ఫోటోలను వెంటనే ఇద్దరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో తమదైన శైలి క్యాప్షన్లతో పోస్ట్ చేశారు. టోర్నీలో భాగంగా స్విట్జర్లాండ్ గురువారం జరగనున్న తన తదుపరి మ్యాచ్లో గ్రీస్తో తలపడనుండగా... అమెరికా బ్రిటన్ తో తలపడనుంది.