ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
మార్టినా హింగిస్తో కలిసి అమెరికాలో ఫ్యామిలీ సర్కిల్ కప్ గెలిచిన అనంతరం మంగళవారం హైదరాబాద్కు వచ్చిన సానియా మిర్జా బుధవారం ఫెడ్ కప్ జరుగుతోన్న ఎల్బీ స్డేడియంలో సందడి చేసింది.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తర్వాత సానియా ఆడుతున్న తొలి టోర్నీ కాబోతుండటం అభిమానలు ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
తొలుత ఆమె సింగిల్స్ బరిలోకి దిగుతుందని ప్రచారం జరిగినా కనీసం డబుల్స్లో కూడా అమె పేరు లేకపోడవంతో అభిమానులు నిరాశ చెందారు.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
పాకిస్థాన్తో పోరులో బరిలోకి దిగకున్నా, కెప్టెన్గా క్రీడాకారిణులను సూచనలిస్తూ కనిపించిన సానియాను చూసి అభిమానులు ఒకింత సంతృప్తి పడ్డారు.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
మధ్యమధ్యలో అభిమానులకు ఆటోగ్రాఫ్లిచ్చారు. ఇటీవల వరకు అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ల్లో పాల్గొన్నందున ఆమె విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
అయితే గురువారం మలేసియాతో జరిగే మ్యాచ్లో సానియా మిర్జా ఆడతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
ఇది ఇలా ఉంటే గ్రూప్-సిలో ఆడిన తొలిమ్యాచ్లో భారత జట్టు 3-0తో పాకిస్థాన్ను చిత్తుచేసింది. తొలి సింగిల్స్లో ప్రార్థనా తోంబరె 6-1, 6-0తో పాక్ ప్లేయర్ సారా మన్సూర్ను ఓడించగా, రెండో సింగిల్స్లో అంకితా రైనా 6-0, 6-1తో ఉష్నా సుహైల్పై అలవోకగా గెలిచి భారత్కు 2-0 ఆధిక్యాన్ని అందించారు.
ఫ్యాన్స్కు సానియా ఆటోగ్రాఫ్స్, భారత్ విజయం
ఇక నామమాత్రమైన డబుల్స్మ్యాచ్లో నటాషా, ప్రార్థన జోడీ 6-0, 6-4తో ఖురేషీ, సుహైల్ జోడీపై గెలుపొంది 3-0తో భారత్కు ఆధిక్యాన్నిచ్చారు. ఇక పూల్-సిలో భారత్ తమ రెండోమ్యాచ్ను గురువారం మలేషియాతో ఆడనుంది.