హైదరాబాద్: రాష్ట్రానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియా, బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఎంతో పేరు తెచ్చారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఒలింపిక్ డే రన్ ను ఆయన శనివారం ఉదయం ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రగా తీర్చి దిద్దుతామని ఆయన చెప్పారు. శారీరక దార్ఢ్యం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఉత్తమ క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ రన్ లో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు.