
హైదరాబాద్: ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ వింబుల్డన్ మాజీ ఛాంపియన్ పాట్ కాష్ కోర్డులో అడుగుపెట్టి కాలాన్ని వెనక్కి తిప్పాడు. పెర్త్లో జపాన్ వర్సెస్ అమెరికా పోటీలో ఆశ్యర్యాకరంగా హోప్మ్యాన్ కప్ మిక్సింగ్ టీమ్లో మాజీ వింబుల్డన్ ఆటగాడు సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం జాక్ సాక్ అమెరికాకు చెందిన కొకొ వాండెవెగే అనే మహిళకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి మిక్స్డ్ డబుల్స్ ఎగ్జిబిషన్లో భాగంగా ఆస్ట్రేలియన్ మాడిసన్ ఇంగ్లిస్, జపాన్కు చెందిన యూచీ సుగితల బృందంతో తలపడనున్నారు.
పెర్త్ ఎరెనా స్టేడియంలో ఉద్విగ్నమైన ఈ రోజున జాక్ సాక్ ప్రత్యర్థి సుగితను ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాక్ తన నడుముకు గాయం అవడంతో మ్యాచ్ నుంచి తప్పుకోవలసి వచ్చింది.
1987లో ఆడిన వింబుల్డన్ ఛాంపియన్ కప్ అనంతరం 1989 హోప్మన్ కప్ వరకు ఏ మ్యాచ్లో ఆడలేదు. సుగిత, ఇంగ్లిస్ల ద్వయం మొదటి టై బ్రేక్ కాకముందు 2-1 స్కోరును సాధించారు. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 3-0లీడ్తో ఉన్నారు.
ఇదిలా ఉంచితే జాక్ 0-4, 4-3 (5-2), 4-0తో మూడో రౌండ్తో
మ్యాచ్ను గెలిచాడు. మొత్తంగా క్యాష్ ఇప్పటికీ తిరుగులేని మనిషిలా నిలిచి కోర్ట్లో జయకేతనం ఎగురేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.