
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ల జోడీ ఓడిపోయింది. మెల్బోర్న్ పార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్కు చెందిన ఎడ్వర్డ్ రోజర్-వెస్లిన్ల జోడీ చేతిలో 4-6, 7-6, 3-6 తేడాతో ఓటమి పాలయ్యారు.
సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు అత్యుత్తమ ఆటతీరుని కనబర్చారు. భారత్కు చెందిన రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ల రెండు బ్రేక్ పాయింట్లలో ఒక దానిని పాయింట్గా మార్చగా, ప్రాన్స్కు చెందిన ఎడ్వర్డ్ రోజర్-వెస్లిన్ల జోడీ 12 బ్రేక్ పాయింట్లలో మూడింటిని పాయింట్లుగా మలుచుకుంది.
కాగా, ఆదివారం పురుషుల డబుల్స్లో లియాండర్ పేస్ పోరాటం ముగిసిన సంగతి తెలిసిందే. ప్రిక్వార్టర్స్లో లియాండర్ పేస్-పూరవ్ రాజా 1-6, 2-6తో జువాన్ సెబాస్టియన్-రాబర్ట్ ఫరా (కొలంబియా) చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రెండేసిసార్లు భారత జోడీ సర్వీస్ బ్రేక్ చేసిన జువాజ్ జంట సులభంగా విజయాన్ని సొంతం చేసుకుంది.