న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎదురులేని ఒసాకా, సెరెనా.. ఫెడరర్‌కు మరో సునాయాస విజయం!!

Australian Open 2020: Naomi Osaka, Serena Williams and Roger Federer enters third round

మెల్‌బోర్న్‌: స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో హవా కొనసాగిస్తున్నాడు. రికార్డుస్థాయిలో ఏడోసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఫెడరర్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6-1, 6-4, 6-1తో ప్రపంచ 41వ ర్యాంకర్‌ ఫిలిప్‌ క్రాజినోవిచ్‌ (సెర్బియా)పై సునాయాస విజయం సాధించాడు. 92 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు.

కోహ్లీ ట్వీట్.. బ్యూటిఫుల్‌ ఆక్లాండ్‌లో పసందైన విందు!!కోహ్లీ ట్వీట్.. బ్యూటిఫుల్‌ ఆక్లాండ్‌లో పసందైన విందు!!

శుక్రవారం జరిగే మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జాన్‌ మిల్‌మన్‌తో ఫెడరర్‌ తలపడనున్నాడు. మిల్‌మన్‌ 6-4, 7-5, 6-3తో హ్యూబర్ట్‌ హర్కాజ్‌ (పోలెండ్‌)పై నెగ్గాడు. 2018 యూఎస్‌ ఓపెన్‌లో రోజర్‌ను మిల్‌మన్‌ ఓడించాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌, రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) నోవాక్ జొకోవిచ్‌ 6-1, 6-4, 6-2తో టట్సుమా (జపాన్‌)పై నెగ్గి మూడోరౌండ్‌ చేరాడు. 8వ సీడ్‌ బెరెటినీ, 18వ సీడ్‌ డిమిత్రోవ్‌ రెండోరౌండ్‌లో పోరాడి ఓడారు. ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)కు తన ప్రత్యర్థి కోల్‌ష్రైబర్‌ (జర్మనీ) నుంచి వాకోవర్‌ లభించింది.

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌), మాజీ విజేత సెరెనా విలియమ్స్‌ (అమెరికా), టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా)లకు ఎదురులేకుండా పోయింది. ముగ్గురు సునాయాస విజయాలతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. మూడో సీడ్‌ ఒసాకా 6-2, 6-4తో సాయ్‌సాయ్‌ జెంగ్‌ (చైనా)పై, సెరెనా 6-2, 6-3తో తమారా జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై, బార్టీ 6-1, 6-4తో పొలోనా హెర్‌కాగ్‌ (స్లొవేనియా)పై విజయాలను అందుకున్నారు. 15 ఏళ్ల అమెరికా టీనేజర్‌ కోరి గౌఫ్‌ 4-6, 6-3, 7-5తో సిర్‌స్టీ (రొమేనియా)పై విజయం సాధించింది. క్విటోవా, మాడిసన్‌ కీస్‌, వొజ్నియాకి కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

కాలి పిక్కలో నొప్పి కారణంగా భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం నుంచి వైదొలిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉంది. నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో మాత్రం నేడు జరిగే తొలి రౌండ్‌లో సానియా-నదియా జంట జిన్‌యున్‌ హాన్‌-లిన్‌ జు (చైనా) జోడీతో ఆడనుంది. ఇక పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

Story first published: Thursday, January 23, 2020, 8:19 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X