న్యూఢిల్లీ: మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ మరోసారి తన సత్తా చాటాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరచి ఆస్టేలియన్ ఓపెన్లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్లో మార్టినా హింగిస్తో కలిసి బరిలోకి దిగిన లియాండర్ పేస్ విజయం సాధించిన టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మ్లదనోవిచ్ క్రిస్టినా, నెస్టర్ జోడీపై 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో పేస్, మార్టినా జోడీ ఓడించి ఘన విజయం సాధించింది. లియాండర్ పేస్ ఖాతాలో ఇది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్.