
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత్ జోరు కొనసాగుతోంది. టెన్నిస్ పురుషుల సింగిల్స్లో భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నెష్ గుణేశ్వరన్ కాంస్య పతకం సాధించాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
సెమీఫైనల్లో ఉబ్జెకిస్థాన్కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ చేతిలో 2-6, 2-6 తేడాతో ప్రజ్నెష్ గుణేశ్వరన్ ఓటమిపాలయ్యాడు. దీంతో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్లో ప్రజ్నెష్ గుణేశ్వరన్ ఏ దశలోనూ తన ప్రత్యర్ధికి పోటీ ఇవ్వలేకపోయాడు. టెన్నిస్లో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం.
తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.
అంతకముందు టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడి రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జోడీ స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో కజకిస్థాన్ జోడీపై రోహన్ బోపన్న, దివిజ్ శరన్ జోడీ 6-3, 6-4 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకంతో మెరిసింది. తొలి సెట్ను 6-3 తేడాతో గెలిచిన బోపన్న జోడి.. రెండో సెట్ను 6-4తో సొంతం చేసుకుంది.