చైనా వేదికగా జరుగుతున్న కున్పింగ్ ఓపెన్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా అదరగొట్టింది. మహిళల సింగిల్స్లో మాజీ యుఎస్ ఓపెన్ ఛాంపియన్ సమంత స్టోసర్ను ఓడించి అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన రెండో రౌండ్లో అంకిత 7-5, 2-6, 6-5 తేడాతో సమంత స్టోసర్(ఆస్ట్రేలియా)పై గెలిచింది. సమంతతో పోటీపడడం అంకితకు ఇది రెండోసారి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
రెండు గంటల 50 నిమిషాల పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి సెట్ గెలిచిన అంకిత.. రెండో సెట్ను ప్రత్యర్థికి అప్పగించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో జోరును కొనసాగిస్తూ.. సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. తర్వాతి రౌండ్లో చైనాకు చెందిన కైయిలిన్ జాంగ్తో రైనా తలపడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో అంకిత 178వ స్థానంలో ఉండగా.. సమంత 77వ స్థానంలో ఉంది. ఇటీవల అంకిత ఇస్తాన్బుల్లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది.