దోహా: ఇండో-స్విస్ అగ్రశ్రేణి జోడీ సానియా మీర్జా-మార్టీనా హెంగీస్ 41వ విజయం సాధించింది. దోహాలో జరుగుతున్న 2.8మిలియన్ డాలర్ల ఖతార్ టోటల్ ఓపెన్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.
అన్ సీడెడ్ చైనీస్ జోడీ యీ ఫినక్స్, సాయిసాయి జెంగ్.. సానియా జోడీపై పోరాడినప్పటికీ ఓటమిపాలుకాక తప్పలేదు. 6-4, 6-4, 10-4 తేడాతో 25నిమిషాలపాటు జరిగిన మ్యాచులో సానియా-హెంగీస్ జోడీ సునాయాస విజయం సాధించింది.
ఖలీఫా ఇంటర్నేషనల్ టెన్ని అండ్ స్క్వాష్ కాంప్లెక్స్లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచులో గెలిపొందిన సానియా జోడీ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. కాగా, ఈ ఏడాది సానియా జోడీ ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు.
సిడ్నీ, బ్రిస్బేన్, సెయింట్ పీటర్స్బర్గ్, ఆస్ట్రేలియన్ ఓపెన్లను ఈ జోడీ గెలుచుకుంది. కాగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా-మార్టీనా జోడీకి వీరి అభిమానులు ముద్దుగా 'సాన్టీనా' అని పిలుచుకుంటున్నారు.