న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెంపు...

2019 Wimbledon prize money 344 cores, rises by 11.8 percent

లండన్‌లో జరిగే ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆడే ఆటగాళ్లకు శుభవార్త. వింబుల్డన్‌ టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీని నిర్వాహకులు భారీగా పెంచారు. 2019 టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 344 కోట్లు అని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ మంగళవారం ప్రకటించింది. ఇది గతేడాది కంటే ఇది 11.8 శాతం ఎక్కువ.

పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలు రూ. 21.33 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ అందుకోనున్నారు. ఇది గతేడాది కంటే దాదాపు రూ. 90 లక్షలు ఎక్కువ. ఈసారి టోర్నీలో నిర్ణయాత్మక సెట్‌లో 12-12 గేమ్‌లతో సమమైనప్పుడు టైబ్రేక్‌ నిర్వహించనున్నారు. ఇంతకుముందు చివరి సెట్‌ 6-6తో సమమైనప్పుడు టైబ్రేక్‌ ఉండేది.

గ్రాండ్‌స్లామ్ టోర్నీల ప్రైజ్‌మనీ ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతోంది. 2018లో వింబుల్డన్‌ టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీ రూ. 309 కోట్లుగా ఉంది. 2017లో కంటే 7.6 శాతం అధికం. ఇక 2017లోప్రైజ్‌మనీ రూ. 287 కోట్లుగా ఉంది. వింబుల్డన్ టోర్నీకి భారీ ఆదరణ ఉన్న విషయం అందరికి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ప్రైజ్‌మనీని పెంచుతున్నారని సమాచారం.

Story first published: Wednesday, May 1, 2019, 12:21 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X