టీమిండియా ప్రధాన పేసర్ జహీర్ ఖాన్ .. మరో పేసర్ శ్రీశాంత్ లు గాయాల కారణంగా టెస్ట్ సీరీస్ నుండి వైదొలిగారు. ఇంతకుముం దు ప్రకటించిన 16 మందితో కూడిన టెస్ట్ జట్టుకు జహీర్ ఖాన్ , శ్రీశాంత్ లు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే.. అర్ధంతరంగా వీరిద్దరూ గాయపడడంతో.. ఈ నెల 20 నుండి కింగ్ స్టన్ వేదికగా ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ ల కు అందుబాటులో ఉండడం లేదు. జహీర్ ఖాన్ కుడికాలి మడమ గాయంతో బాధపడుతుండగా.. శ్రీశాంత్ ఎల్బో ఇంజ్యూరీతో జట్టుకు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో అభిమన్యు మిథున్ , ప్రవీణ్ కుమార్ లు ఎంపికయ్యారు. త్వర లో వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సీరీస్ నుండి జహీర్ ఖాన్ , శ్రీశాంత్ లు వైదొలిగారు.జహీర్ ఖాన్ మడమ గాయంతో.. శ్రీంశాంత్ ఎల్బో తో బాధపడుతున్నారు. వీరి ద్దరికీ కొంతకాలం విశ్రాంతి అవసరం అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే.. వీరేంద్ర సెహ్వాగ్ , గౌతమ్ గంభీర్ , యువరాజ్ సింగ్ లు గాయాలబారిన పడి టెస్ట్ సీరీస్ కు దూరమవ్వగా.. సచిన్ టెండూల్కర్ సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాన బౌలర్లు ఇద్దరూ వైదొలగడంతో.. టీమిండియా మరింత బలహీనపడింది. కాగా.. ప్రస్తుత వన్డే సీరీస్ లో పాల్గొనకుండా జహీర్ విశ్రాంతి తీసుకోగా.. శ్రీశాంత్ వన్డే సీరీస్ కు ఎంపిక కాలేదు. అయితే.. గాయాలతో బాధపడుతూ కూడా ఐపీఎల్ లో పాల్గొన్న సెహ్వాగ్ , గంభీర్ లు అంతర్జాతీయ సీరీస్ లకు మాత్రం విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ప్రధాన బౌలర్లు కూడా అదే దారిని అనుసరించడంతో.. క్లబ్ వర్సెస్ కంట్రీ చర్చ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.జహీర్ ఖాన్ ఇటీవలికాలంలో తరుచూ గాయపడుతూ.. ప్రధాన సీరీస్ లను మిస్సవుతున్నాడు. గత సంవత్సరం భుజం గాయంతో.. శ్రీలంక టూర్ కు వెళ్లలేకపోయిన జహీర్ ను తొడ గాయంతో బాధపడుతున్నప్పటికీ.. ప్రపంచకప్ కు ముందు జరిగిన.. న్యూజీలాండ్ , దక్షిణాఫ్రికా సీరీస్ లకు మాత్రం బలవంతంగా ఎంపిక చేశారు. ప్రపంచకప్ లో 21 వికెట్లు తీసీ అగ్రస్థానంలో నిలిచిన జహీర్ ఆ తరువాత ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రధాన బౌలర్ పేసర్ గా ఆడాడు. #13;