For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పటికైనా జగన్ ముఖ్యమంత్రి: రఘవీరా

By Pratap
Raghuveera Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. రోశయ్య తర్వాత వైయస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ పేరును కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ శాసనసభ్యులు, కార్యకర్తలు, ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీలో ఉన్నది ఒక్కటే వర్గమని, జగన్ వర్గం ఒకటీ రోశయ్య వర్గం మరోటీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయని, ఆంధ్రజ్యోతి దిన పత్రికకు తమపై ప్రేమ ఎక్కువైందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలని జగన్ ఎవరినైనా అడిగారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఇవ్వాలో పార్టీ అధిష్టానానికి తెలుసునని ఆయన అన్నారు.

వ్యవసాయ శాఖాధికారి రాజేశ్వరి ఆత్మహత్య తర్వాత సబ్సిడీలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని ఆయన అన్నారు. రాజేశ్వరి వాంగ్మూలం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాజేశ్వరి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+