కజికిస్తాన్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ మెరిశారు. మంగళవారం ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ అర్హత మ్యాచులో భాగంగా జరిగిన 53 కేజీల కేటగిరీ ఓపెనింగ్ రౌండ్లో వినేశ్ 13-0 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్పై ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ఫొగట్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
'ఆర్చర్ సాధిస్తాడు.. అతను జట్టులో ఉండటం మా అదృష్టం'
ఎన్నో అంచనాలతో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్కు సిద్ధమైన ఫొగట్ భారీ విజయంతో బోణి కొట్టారు. మ్యాచ్ ఆగారాబం నుంచే ఫొగట్ ఆధిపత్యం చెలాయించింది. తొలుత 4-0 తేడాతో ఆధిక్య సాధించిన ఫొగట్.. అదే జోరును చివరి వరకు కొనసాగించారు. ఏ దశలోనూ సోఫియాకు అవకాశం ఇవ్వని ఫొగట్.. చివరకు సోఫియాను మ్యాట్ నుంచి బయటకు నెట్టడంతో భారీ ఆధిక్యం సాధించారు.
అయితే సోఫియాను మొత్తం మ్యాట్ నుంచి ఔట్ చేసిన సమయంలో వినేశ్ కాలు లైన్ లోపల ఉందా.. బయట ఉందా అనే దానిపై స్పష్టత రాలేదు. అదే సమయంలో సోఫియా చాలెంజ్కు వెళ్లడంతో రిఫరీలు పలు కోణాలు పరిశీలించి వినేశ్ కాలు లైన్ లోపలే ఉందని తేల్చారు. దాంతో వినేశ్ 13-0 తేడాతో గెలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. తన తదుపరి రౌండ్లో వరల్డ్ చాంపియన్, జపాన్ రెజ్లర్ ముయా ముకైదాతో వినేశ్ ఫొగట్ తలపడనున్నారు. ఇంతకుముందు 50 కేజీల విభాగంలో ఆడే వినేష్.. ఇప్పుడు 53 కేజీల విభాగంలో ఆడుతున్నారు.