హైదరాబాద్: భారత పారా అథ్లెట్ దీపా మాలిక్ మరో ఘనత సాధించింది. దుబాయ్లో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో ఆమె కెరీర్లో అత్యుత్తమంగా డిస్క్ను 8.01 మీటర్ల దూరం విసిరి ఈ ఘనత సాధించింది.
డిస్కస్ త్రో ఆసియా ర్యాంకింగ్ 53 కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు ఆసియా క్రీడల సంయుక్త కేటగిరీలో ఈవెంట్ 51/52/ 53లో రెండోస్థానం ద క్కించుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో వచ్చే అక్టోబరులో జకర్తాలో జరిగే ఆసియా పారా గేమ్స్కు ఎంపికైంది.
At FAZZA GRAND PRIX World Cup athletics in Dubai, #TOSBSpeaker Deepa Malik @DeepaAthlete adopts a new career in Discus Throw and in 1st attempt makes it to Asia Ranking 1 in 2018. Congratulations! pic.twitter.com/xh6eYxPJBz
— The Outstanding Speakers' Bureau (@The_OSB) March 14, 2018
హర్యానాకు చెందిన 47 ఏళ్ల దీపా మాలిక్ విజయం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. నడుం నుంచి కింది భాగం అచేతనంగా మారడంతో 19 ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. అయినా పట్టుదలతో ఆటల్లో రాణిస్తోంది. 2016లో జరిగిన పారాలింపిక్స్లో ఆమె షాట్పుట్తో పాటు జావెలిన్ త్రో, స్విమ్మింగ్లో పోటీపడింది. పారాలింపిక్స్లో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది.
Resilience in the face of adversity is what @DeepaAthlete life’s story is all about! She is an inspiration to many who think their challenges are too big to #BreakTheTag of negativity and social pressure! pic.twitter.com/EaeEyFzFDl
— Shiv Naresh (@shivnareshind) March 11, 2018
వెన్నెముక ట్యూమర్తో బాధపడుతున్న ఆమెకు మొత్తం 31 శస్త్ర చికిత్సలు జరిగాయి. నడుము నుంచి కాలి వరకూ జరిగిన ఆపరేషన్స్లో 183 కుట్లు పడ్డాయి. మంచానికే పరిమితం కావాల్సిన ఆమె క్రీడాకారిణిగా ఎదగడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శ్రమించింది. షాట్పుట్లోనేగాక, జావెలిన్త్రో, స్విమ్మింగ్ విభాగాల్లోనూ మేటి పారా క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది.