హైదరాబాద్: భారత బాక్సర్ అమిత్ పంగల్ చరిత్ర సృష్టించాడు. రష్యాలోని ఎకటరీన్బర్గ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం 52 కేజీల విభాగంలో కజకిస్థాన్కు చెందిన సాకెన్ బిబోసినోవ్పై విభజన నిర్ణయం ద్వారా 3-2తో గెలుపొందాడు.
ఫలితంగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు వెళ్లిన తొలి భారత బాక్సర్గా అమిత్ పంగల్ చరిత్ర సృష్టించాడు. తాజా విజయంతో ఈ ఛాంపియన్షిప్లో అమిత్ పంగల్ భారత్కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు. గతంలో అమిత్ పంగల్ ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించాడు.
మరోసారి అఫ్రిది అక్కసు.. శ్రీలంక క్రికెటర్లపై ఐపీఎల్ ఒత్తిడి ఉంది!!
అంతకముందు వరల్డ్ ఛాంపియన్స్లో విజేందర్ సింగ్, వికాస్ కృష్ణన్, శివ థాపా, గౌరవ్ బిధురి కేవలం రజత పతకాలకే పరిమితమయ్యారు. అయితే, వీరెవరికీ సాధ్యం కాని ఫైనల్స్లోకి అమిత్ పంగల్ దూసుకెళ్లడం విశేషం. ఈ ఛాంపియన్షిప్లో ఒక ఎడిషన్లో భారత్ ఒక్క కాంస్య పతకం కంటే ఎక్కువ సాధించలేదు.
అయితే, ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్షిప్లో అమిత్ పంగల్, మనీష్ కౌశిక్లు సెమీ ఫైనల్కు చేరి రెండు పతకాలను ఖాయం చేశారు. దీంతో ఈ టోర్నీలో భారత్ రెండు పతకాలను సొంతం చేసుకోనుంది. ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచి అమిత్ పంగల్ తన పదునైన పంచ్లతో ప్రత్యర్ధిని బెంబేలెత్తిస్తున్నాడు.