హైదరాబాద్: దేశానికి అత్యున్నత క్రీడాకారులనందించే సాయ్ శిక్షణా కేంద్రంలో చోటు చేసుకున్న ఓ దారుణం తాజాగా వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తోటి క్రీడాకారిణిని లోబరుచుకున్న ఓ అథ్లెట్ ఇప్పుడు మొహం చాటేయడం సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే... రాతిబాద్ ప్రాంతంలోని సాయ్ కేంద్రంలో క్రీడల్లో శిక్షణ పొందేందుకు 2013లో చేరిన తనపై తోటి క్రీడాకారుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మూడేళ్లుగా అత్యాచారం చేశాడని 25 ఏళ్ల క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత క్రీడాకారణితోపాటు యువకుడిది కూడా హర్యానా రాష్ట్రం.
2013లో ఇద్దరూ కలిసి మధ్యప్రదేశ్లోని రేతిబాద్ సాయ్ సెంటర్లో శిక్షణ కోసం చేరారు. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరీక సంబంధం పెట్టుకున్నాడని బాధిత క్రీడాకారిణి వాపోయింది. శిక్షణ ముగిసి సొంత రాష్ట్రం చేరినా తనతో సంబంధం కొనసాగించాడని ఫిర్యాదులో పేర్కొంది.
తామిద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీసి ఇప్పుడు బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నాడని రోహ్తక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు తనను పెళ్లి చేసుకోనని బెదిరిస్తున్నాడని కూడా పేర్కొంది. ఆ క్రీడాకారుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్రీడాకారిణి రోహతక్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దానిని దర్యాప్తు చేసేందుకు వీలుగా రాతిబాద్ పోలీసుస్టేషనుకు బదిలీ చేశారు. సాయ్ కేంద్రంలో మూడేళ్లు కలిసి ఉన్నపుడు వారి మధ్య శారీరక బంధం ఏర్పడిందని పోలీసు అధికారి అశోక్ గౌతమ్ చెప్పారు. కాగా, సాయ్ శిక్షణ కేంద్రంలో ఈ అత్యాచారం వెలుగు చూడటం సంచలనం సృష్టించింది.