
హైదరాబాద్: 36 ఏళ్లుగా ఒలింపిక్ పతకాన్ని సాధించాలన్న న్యూజిలాండ్ ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. ఏటా ఓడిపోవడం మరో వింటర్ ఒలింపిక్స్ కోసం ఎదురుచూడడం పరిపాటైంది. చివరికి 2018 ప్యాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ లోనే ఆ దేశానికి పతకం దక్కడంతో ఆనందానికి అవధి లేకుండా పోయింది.
బిగ్ ఎయిర్ పోటీలో న్యూజిలాండ్ రజితాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఈ పోటీలో 92 పాయింట్లు గెలుచుకున్న జోయ్ సాడోస్కి మూడో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు స్థానాల్లో అమెరికాకు చెందిన జామీ అండర్సన్ (177.25)పాయింట్లతో, ఆనా గసీర్ (174.50) తో ఉన్నారు.
ఇంకో ప్రత్యేక విషయం ఏమంటే న్యూజిలాండ్ కు ఇది కేవలం రెండో పతకం కావడం విశేషం. మొదటిది 1992వ సంవత్సరంలో స్లాలొమ్ లో గెలిచినందుకు గాను వెండి పతకం గెలుచుకుంది అన్నెలిసె కోబర్గెర్.
పతకాన్ని గెలుచుకున్న జోయ్ సాడోస్కి తన ఆనందాన్ని ఇలా పంచుకుంది. 'నేనింత వరకు ఇలాంటి ప్రదర్శన చేసింది లేదు. ఇదొక కొత్త అనుభవం. నాకు చాలా ఆనందంగా ఉంది' అని ఉద్వేగానికి లోనైంది. ఆ తర్వాత జరిగిన స్కై పైప్ పోటీల్లో పురుషుల విభాగంలో పదహారేళ్ల నికో పొర్టియోస్ రజితాన్ని గెలుచుకున్నాడు.