ఈమెయిల్ ద్వారా కూడా తనకు సమాచారం ఇవ్వలేదు
అయితే తన ఎంపికపై కనీసం ఈమెయిల్ ద్వారా కూడా తనకు సమాచారం ఇవ్వకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు డేవిస్ కప్కు తాను ఎంపిక అవకపోవడానికి ఐటా చెప్పిన సాంకేతిక కారణం తనను మరింత ఆశ్చర్యానిగి గురి చేసిందని చెప్పాడు.
డబుల్స్ ఆటగాళ్లలో మెరుగైన ర్యాంకులో ఉన్నాను
'మాస్టర్స్ సిరిస్ ఈవెంట్స్లో రెండు వైపులా (ఎడమ వైపు, కుడి వైపు) ఆడి నేను ఏటీపీ 250, 500 గెలిచాను. దేశంలోని డబుల్స్ ఆటగాళ్లలో మెరుగైన ర్యాంకులో ఉన్నాను. యాడ్ కోర్టు (ఎడమ వైపు)లో ఆడతానన్న సాంకేతిక కారణంతో నన్ను ఎంపిక చేయలేదని ఐటా చెప్పింది' ఇది ఎంతగానో బాధను కలిగించింది.
భారత్లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది
'ఈ ఎంపిక ముందు సెలక్షన్ కమిటీ కాస్త కసరత్తు చేసి ఉండాల్సింది. ఏటీపీ టూర్ ఫైనల్స్-2012లో మహేశ్ భూపతితో కలిసి నేను డ్యూస్ కోర్టు (కుడి వైపు)లో ఆడాను. ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తోంటే భారత్లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది' బోపన్న తీవ్ర విమర్శ చేశాడు.
ర్యాంకింగ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.
సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉన్న జీషన్ అలీ దీనిపై మాట్లాడుతూ డేవిస్ కప్లో జాతీయ జట్టుని ర్యాంకింగ్ ఆధారంగా సెలక్టర్లు ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు. కాగా, ఫిబ్రవరి 2017లో జరగనున్న డేవిస్ కప్కు సాకేత్ మైనేని, రామ్కుమార్ రామనాథన్, యుకీ బాంబ్రీ, లియాండర్ పేస్, ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్కు జట్టులో చోటు లభించింది.