రాజ్ కోట్ :ఇంగ్గాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రా ముగియడానికి కారణం ఎవరు...ఆట ముగించడానికి ఇంకా సమయం ఉన్నా ఇండియా బ్యాట్స్ మెన్ ఎందుకు బ్యాటింగ్ ను కొనసాగించలేదు.ఇంగ్లాండ్ కెప్టెన్ కక్ వ్యూహం కారణంగానే ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిందా....ఇంగ్లండ్ కెప్టెన్ ప్రతిపాదనకు ఇండియా కెప్టెన్ కూడ సానుకూలంగా స్పందించాడా...అంటే అవుననే చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ అన్ని విభాగాల్లో రాణించారు. ఇంగ్లాండ్ రెండో ఇన్సింగ్ ను డిక్లేర్డ్ చేసిన తర్వాత భారత్ బ్యాటింగ్ కు దిగింది. రెండో ఇన్సింగ్ లో దాదాపుగా 49 ఓవర్లలో 310 పరుగులను చేయాలి.కాని నిర్థేశించిన ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లను భారత్ ఆడింది . కాని, లక్ష్యానికి అవసరమైన పరుగులు చేయలేదు.
నిజానికి 49 ఓవర్లు ఆడిన తర్వాత మ్యాచ్ ముగించాల్సి ఉంది. కాని, బారత్ బ్యాటింగ్ ను కొనసాగించింది.భారత్ బ్యాట్స్ మెన్ 52.3 ఓవర్లు ఆడారు. కాని, నిర్ధేశించిన లక్ష్యాన్ని చేయలేదు. 49 ఓవర్లు ముగిసినా అంపెర్లు ఆటను ముగించలేదు. ఇంకా 3 ఓవర్లు ఆడితే 90 ఓవర్లు పూర్తవుతాయని అంపైర్లు ఆటను కొనసాగించారు. దీంతో బారత్ బ్యాంటింగ్ ను కొనసాగించింది.ఆట ముగించే సమయానికి 10 నిమిషాల ముందే ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ తన గేమ్ ప్లాన్ ను అమలు చేశాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ వ్యూహం పలించింది
మ్యాచ్ మరో పది నిమిసాల్లో పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ తన ప్లాన్ ను అమలు చేశాడు. భారత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడిని పెంచాడు. ఫీల్డర్లను దగ్గరగా మోహారించాడు. అయితే అదే సమయంలో కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడు.. బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీ , లేదా సెంచరీ చేసిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆడుతాడు. అయితే హాప్ సెంచరీ, సెంచరీ దగ్గర్లో ఉంటే చాలా నెమ్మదిగా ఆడుతాడు.దీంతో మానసికంగా కృంగిపోతాడు.దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ డ్రా ప్రతిపాదన తెచ్చాడు.
విరాట్ కోహ్లీ 49 పరుగులతో క్రీజ్ లో ఉన్న సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కోహ్లీ వద్ద డ్రా ప్రతిపాదన తెచ్చాడు. ఈ ప్రతిపాదనను కోహ్లీ కూడ సానుకూలంగా స్పందించాడు. మ్యాచ్ కొనసాగితే కోహ్లి హాప్ సెంచరీ పూర్తయ్యేది. కాని, జట్టు కోసం కోహ్లీ డ్రా కోసం అంగీకరించాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ డ్రా గా ముగియడం పై అనేక అనుభవాలు వచ్చాయని కోహ్లీ చెబుతున్నారు.