హైదరాబాద్: సిడ్నీ వేదికగా జరుగుతున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ షూటర్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం జరిగిన ట్రాప్ షూటింగ్ పోటీల్లో యువ షూటర్ వివాన్ కపూర్ రెండు కాంస్య పతకాలను సాధించాడు. దీంతో ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో చైనా తొలి స్థానంలో కొనసాగుతోంది. 16 ఏళ్ల వివాన్ కపూర్ వ్యక్తిగత విభాగంలో 113 పాయింట్లతో ఫైనల్కి చేరగా, తుది పోరులో చైనీస్ తైపీ కున్ పై యాంగ్పై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ముగ్గురు షూటర్ల బృందంతో జరిగిన పోటీలోనూ భారత్ కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
వివాన్కు ఇది తొలి జూనియర్ వరల్డ్ కప్ మెడల్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ రౌండ్లో లక్ష్యే 8వ స్ధానంలో నిలవగా, ఎలాహి 13వ స్థానంలో నిలిచారు. కాగా, గురువారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే భారత మహిళా షూటర్ ఎలవెనిల్ చరిత్ర సృష్టిస్తూ.. ప్రపంచ రికార్డుతో స్వర్ణాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఎలవెనిల్ ఫైనల్లో 249.8 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా.. క్వాలిఫయింగ్లో ఆమె 631.4 పాయింట్లతో ప్రపంచ రికార్డును తిరగరాసింది.