హైదరాబాద్: ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో వినేష్ ఫోగట్ భారత్కు పతకం ఖాయం చేసింది. వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో జపాన్కు చెందిన యుకీ ఐరీని ఓడించిన ఫోగట్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ చేరింది. ఈ పోటీలో 2-3 తేడాతో చైనాకు చెందిన చున్ లీ చేతిలో ఓటమిపాలై రజితంతో సరిపెట్టుకుంది.
Off to compete at #Bishkek2018! Looking forward to putting my best foot forward and make the country proud! Excited to start off the season well at the Asian Championship 💪😊 pic.twitter.com/HTySNxQ39i
— Vinesh Phogat (@Phogat_Vinesh) February 27, 2018
ఈమె బబితా కుమారి ఫోగట్, గీతా ఫోగట్ల సోదరి. కామన్వెల్త్ పోటీల్లో, ఒలింపిక్స్లో సైతం ఈ అక్కాచెల్లెళ్లు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టారు. వీళ్ల జీవితాల ఆధారంగా ఆమిర్ ఖాన్ 'దంగల్' అనే సినిమాను సైతం తెరకెక్కించారు.
Fear is a reaction. Courage is a decision.🌟💫 pic.twitter.com/pdGNnQJAla
— Vinesh Phogat (@Phogat_Vinesh) February 13, 2018
2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఫోగట్.. తుది పోరులో చైనాకు చెందిన చున్ లీతో పోటీ పడనుంది. మరో భారత మహిళా రెజ్లర్ సంగీత కాంస్య పతకం కోసం పోటీ పడుతోంది. కొరియాకు చెందిన కియున్ ఉమ్తో 59 కిలోల విభాగంలో ఆమె తలపడనుంది.
భారత్కు చెందిన గ్రీకో-రోమన్ రెజ్లర్లు హర్ప్రీత్ సింగ్, రాజేంద్ర కుమార్ కాంస్య పతకాలు సాధించారు.
It’s time we put away all the taboos, the superstitions and the shame about periods. It is the most natural thing in the world. I am a strong believer that every woman in our wonderful country needs to have access to safe and cheap menstrual hygiene products! pic.twitter.com/8BWakqJJk0
— Vinesh Phogat (@Phogat_Vinesh) February 10, 2018
హర్ప్రీత్ 82 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్కు చెందిన ఖషీంబేకోవ్ను 11-3 తేడాతో చిత్తు చేశాడు. రాజేంద్ర కుమార్ 55 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్కు చెందిన మిరాఖ్మెదోవ్ను ఓడించి కాంస్యం దక్కించుకున్నాడు. 3-3తో పాయింట్లు సమంగా ఉన్నప్పటికీ.. విజయం రాజేంద్ర కుమార్నే వరించింది. మిగిలిన రెజ్లర్లు విక్రమ్ కృష్ నాథ్ (63)కేజీలు, సునీల్ కుమార్(87), హర్దీప్ సింగ్(97)కేజీల విభాగంలో తొలి రౌండ్ లోనే వెనుదిరిగారు.