హైదరాబాద్: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రో రెజ్లింగ్ టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ గీతా ఫోగట్ నిరాశపరిచినా యూపీ దంగల్ మాత్రం తమ తొలి మ్యాచ్లో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్లో యూపీ దంగల్ 4-3 తేడాతో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్పై విజయం సాధించింది.
గురువారం రాత్రి సిరి ఫోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో 62కేజీల విభాగంలో గీతా 2-14 తేడాతో గ్రిగోర్జెవా అనస్తేసిజా చేతిలో చిత్తయింది. అయితే వినేశ్ ఫోగట్ (50 కేజీ) 16-0తో సరితా దేవిని ఓడించి యూపీ దంగల్కు ఆధిక్యాన్ని కట్టబెట్టింది. గురువారం నాటి మ్యాచ్లో మొత్తంగా యూపీ నాలుగు బౌట్లు, పంజాబ్ మూడు బౌట్లు నెగ్గాయి.
ఫలితాలు:
UP Dangal beat Punjab Royals 4-3
Abdurakhmonov Bekzod beat Jitender 9-0
Geeta Phogat lost to Grigorjeva Anastasija 2-14
Vicky beat Mausam Khatri 4-2 (Retd. hurt)
Vinesh Phogat beat Nirmala Devi 16-0
Jamaladdin Magomedov lost to Geno Petriashvili 3-4
Zsanett Nemeth lost to Koumba Selene Fanta Larroque 4-0
Nitin beat Utkarsh Kale 8-7
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.