హైదరాబాద్: ఇద్దరు ఆస్ట్రియా ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్ మింటన్ పోటీల నుంచి చిత్తగించారు. అధికారులెవరికీ చెప్పకుండా వారు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. స్వైన్ ఫ్లూ, ఉగ్రవాదుల దాడుల ముప్పు భయంతో వారు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. జూర్గెన్ కోచ్, పీటర్ జవునేర్ ఆరో పురుషుల డబుల్స్ లో ఆరో సీడ్ మాతియాస్ బోయి, కార్స టన్ మోగెన్ సేన్ లతో తలపడాల్సి ఉంది. నిర్వాహకులకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ఆ జంట వెళ్లిపోయింది. అది వారి వ్యక్తిగత నిర్ణయమని, కానీ తమకు సమాచారం ఇవ్వలేదని, వారు స్వైన్ ఫ్లూ, ఉగ్రవాద దాడుల ముప్పుకు భయపడి ఉంటారని బాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య అధికారి ఒకరు చెప్పారు.