|
కరణం మల్లీశ్వరి రికార్డ్..
రెండో రోజే ఈ ఘనతను సాధించడంతో మిగిలిన ఆటగాళ్లు, అథ్లెట్లలో పతకాన్ని సాధించాలనే కాంక్షను రగిలించినట్టయింది. ఇదివరకు తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఇదే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కొరతను తీర్చారు మీరాబాయి చాను. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చైనాకు చెందిన జిహు హౌ బంగారు పతకాన్ని సాధించారు. ఇండోనేషియాకు చెందిన క్యాంటిక్ విండీ ఐషా మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని అందుకున్నారు.
|
202 కేజీలతో
మీరాబాయి చాను.. స్నాచ్ కేటగిరీలో 84 కేజీలు, 87 కేజీల బరువును ఎత్తారు. చైనా వెయిట్ లిఫ్టర్ 88, 92, 94 కిలోల బరువును ఎత్తారు. అప్పటికే చానురెండో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆమెకు రజత పతకం ఖాయమైంది. 89 కేజీలను లిఫ్ట్ చేయడంలో విఫలం అయ్యారు. అదే సమయంలో చైనాకు చెందిన జిహు హౌ 94 కేజీలను లిఫ్ట్ చేయడంతో ఆమెకు స్వర్ణం ఖాయమైంది. ఈ ఈవెంట్తో చైనా వెయిట్ లిఫ్టర్ ఒలింపిక్స్ రికార్డ్ను నెలకొల్పారు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మీరాబాయి 110, 115 కేజీలను లిఫ్ట్ చేశారు. 117 కేజీల బరువును ఎత్తలేకపోయారు. జిహు 116 కిలోలను ఎత్తడంతో ఆధిక్యత ఆమె వైపు మొగ్గింది.
|
సోషల్ మీడియా షేక్..
మొత్తగా చైనా వెయిట్ లిఫ్టర్ 210 కేజీలు, మీరాబాయి చాను 202, ఇండోనేషియా లిఫ్టర్ 194 కేజీల బరువును ఎత్తారు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకాన్ని సాధించగానే చానును ఆకాశానికెత్తేశారు సెలెబ్రిటీలు. మాజీ ఒలింపియన్లు, క్రికెటర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల చేశారు. మీరాబాయి ఫొటోలు, గ్రీటింగ్స్, రికార్డులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రివార్డులను ప్రకటిస్తోన్నాయి.