టోక్యో : టోక్యో ఒలింపిక్స్ 2021 ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ భారీ తేడాతో ఓటమి పాలైంది. 2-6 తేడాతో దక్షిణ కొరియా చేతిలో భారత జోడీ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ ఓడిపోయారు. అంతకుముందు ప్రీ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రీ క్వార్టర్ ఫైనల్లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్ను దీపికా కుమారి, జాదవ్ ద్వయం ఓడించారు.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి అదరగొట్టింది. చైనీస్ తైపీ జట్టుపై 21-16, 16-21, 27-25 తేడాతో విజయం సాధించింది. మొదటి సెట్లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత జోడి.. రెండో సెట్లో ఓటమిపాలింది. ఇక మూడో సెట్ నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరికి 27-25తో సెట్తో పాటు మ్యాచును కైవసం చేసుకుంది.
భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నగాల్ అదరగొట్టాడు. తొలి రౌండ్లో ఉజ్బెకిస్థాన్కు చెందిన డెనిస్ ఇస్తోమిన్పై 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచి రెండో రౌండ్కు అర్హత సాధించాడు. సుమిత్ నగాల్ మూడు సెట్లట్లో తన మార్క్ ఆట కనబరిచాడు. తోలి సెట్ గెలిచినా.. రెండో సెట్ను తృటిలో కోల్పోయాడు. మూడో సెట్లో సుమిత్ నగాల్, డెనిస్ ఇస్తోమిన్ హోరాహోరీగా తలపడ్డారు. చివరకు సుమిత్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు .
Tokyo Olympics 2021: అదరగొట్టిన సౌరభ్ చౌదరీ.. ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్కు భారత్!!