For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2020: శనివారమే చివరిరోజు.. 3 పతకాలపై ఆశలు పెట్టుకున్న భారత్​! షెడ్యూల్ ఇదే!!

Tokyo Olympics 2021: Here is Indias schedule on August 7th

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2020​ చివరి రోజు ఆగస్టు 8 అయినప్పటికీ.. భారత్​ పోటీలు శనివారంతో ముగియనున్నాయి.16వ రోజు భారత్‌కు 3 పతకాలు వచ్చే అవకాశముంది. మొత్తం 3 పతకాంశాల్లో పోటీపడుతుండగా.. అన్నింటిపైనా ఆశలున్నాయి. శనివారం జరిగే పోటీల్లో పురుషుల ప్లేయర్​ నీరజ్​ చోప్రా బరిలోకి దిగనుండగా.. రెజ్లింగ్​లో బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఇక గోల్ఫ్​లో అదితి అశోక్​కు కూడా రజతం లభించే అవకాశం ఉంది. భారత్​కు ఒలింపిక్స్​ 2020లో 5 పతకాలు (2 రజతాలు, 3 కాంస్యాలు) వచ్చిన విషయం తెలిసిందే. చివరిరోజు మరో రెండు పతకాలు సాధించినా.. మెగా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలవనుంది. 2012 లండన్​ ఒలింపిక్స్​లో భారత్ 6 పతకాలు సాధించింది.

మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 4 మ్యాచ్​ కోసం భారత్​ తరఫున అదితి అశోక్​, దీక్షా దగర్​ పాల్గొననున్నారు. దీక్షా దగర్ ​ఉదయం 4.17 గంటల నుంచి, అదితి అశోక్​ 4.48 గంటలకు నుంచి మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్​ శుక్రవారం జరగాల్సి ఉండగా.. వాతవరణ సమస్యల కారణంగా శనివారానికి వాయిదా పడింది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్​ జరిగే అవకాశం లేకపోతే.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతం లభిస్తుంది. అప్పుడు తొలిసారి భారత్​కు గోల్ఫ్​లో పతకం సాధించిన అథ్లెట్​గా ఆమె చరిత్ర సృష్టిస్తుంది.

శుక్రవారం జరిగిన రౌండ్​ 3 మ్యాచ్​లో రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్.. ఈ ఈవెంట్​లో రజతం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మూడు రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా హన్నా గ్రీన్​, న్యూజిలాండ్​కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు. ఇక పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్​ విభాగం సెమీస్లో ఓడిపోయిన బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఈ మ్యాచ్​ సాయంత్రం 3.15 గంటల తర్వాత ప్రారంభం కానుంది.

పురుషుల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​-ఏలో సత్తాచాటిన నీరజ్​ చోప్రా.. తొలి ప్రయత్నంలోనే ఫైనల్​కు ఎంపికయ్యాడు. ఈ ఒలింపిక్స్‌లో నీరజ్ కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో అందరూ ఉన్నారు. క్వాలిఫికేషన్ రౌండ్​లో జావెలిన్​ను ఏకంగా 86.59 మీ.(83 మీ. విసిరితే అర్హత) విసిరి ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్​ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరుతో టోక్యో ఒలింపిక్స్ 2020​లో భారత పోటీలు ముగియనున్నాయి. నీరజ్​ ఫైనల్​ మ్యాచ్ నేపథ్యంలో.. అతడు భారత్​కు గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఒడిశాకు చెందిన మానస్​ కుమార్ సాహో అనే ఆర్టిస్ట్​ బీచ్​లో సైకత శిల్పాన్ని రూపొందించాడు. యావత్​ భారతం స్వర్ణ పతకం కోసం ఎదురుచూస్తోందని రాసుకొచ్చాడు.

Story first published: Friday, August 6, 2021, 22:41 [IST]
Other articles published on Aug 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+