టోక్యో: ఒలింపిక్స్ 2020లో రెజ్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ తెస్తుందని భావిస్తున్న భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకుంది. కోచ్ వోలెట్ అకోస్తో కలిసి శిక్షణ కోసం హంగరీ వెళ్లిన వినేష్.. యురోపియన్ యూనియన్ వీసాపై ఒకరోజు ఎక్కువగా అక్కడ గడిపింది. దీంతో మంగళవారం రాత్రి టోక్యో విమానం ఎక్కడానికి వచ్చిన ఆమెను.. అక్కడి అధికారులు అడ్డుకున్నారు. తాను ఎక్కాల్సిన ఫ్లైట్ వెళ్లిపోవడంతో వినేష్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే సమస్య పరిష్కారమైనట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పేర్కొంది.
రెజ్లర్ వినేష్ పోగాట్ ఈ రోజు (బుధవారం) టోక్యో చేరుకుంటుందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పష్టం చేసింది. 'వీసా గడువు సరిగా చోసుకోలేదు. ఇది కావాలని చేసింది కాదు. వినేష్ పోగాట్ 90 రోజుల పాటు హంగేరీలో ఉండాల్సి ఉండగా.. ఆమె ఫ్రాంక్ఫర్ట్ చేసే సరికి 91వ రోజు అయింది' అని ఐవోఏ తెలిపింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లు వెంటనే జర్మనీలోని ఇండియన్ కాన్సులేట్కు సమాచారాన్ని చేరవేశారు అని సమాచారం తెలిపింది.
మంగళవారం రాత్రి ఫ్రాంక్ఫర్ట్లోనే ఉన్న వినేష్కు మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్లు చేశారు. బుధవారం టోక్యోలో ల్యాండైన తర్వాత మరోసారి వినేష్ పోగాట్కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు.
Tokyo Olympics 2021: శుభారంభం.. అంతలోనే నిరాశ! ముగిసిన తరుణ్దీప్ రాయ్ పోరాటం!
వినేష్ పోగాట్ రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో భారత్కు గోల్డ్ మెడల్ ఆశలు రేపుతోంది. ఈసారి గోల్డ్ పక్కా అని అందరూ అంచనాలు వేస్తున్నారు. విశ్వ క్రీడల్లో వినేష్ టాప్ సీడ్గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెల 5న ఒలింపిక్స్లో రెజ్లింగ్ పోటీలు ప్రారంభమవుతాయి. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వినేష్.. వరల్డ్ చాంపియన్షిప్స్లో బ్రాంజ్ గెలిచింది. అందుకే ఆమెపై ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి.