
హైదరాబాద్: రెండేళ్ల తర్వాత 2020లో రాబోయే టోక్యో ఒలింపిక్స్ను పురస్కరించుకుని నిర్వహకం సంఘం కొత్త ప్రతిపాదనలు చేపట్టింది. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఖర్చు తగ్గించేందుకే ఈ యోచన చేసింది.
ఇప్పటి వరకు అన్ని గేమ్స్కు కలిపి 12.6 బిలియన్ డాలర్లు అంటే రూ. 800కోట్ల పైమాటే. ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకుందామనే ఆలోచనలో ఉన్న నిర్వహక సంఘం మొత్తంలో నుంచి 1.4బిలియన్ డాలర్లు మిగిలేలా ప్రణాళిక వేసింది. ఇది ఇంతకుముందు చేసిన ప్రణాళికతో పోలిస్తే 0.3బిలియన్ల అదనంగా ఉంది.
క్రీడలనుద్దేశించి ఏడు బిలియన్ డాలర్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఇంకా ఇదే ఆఖరు కాదంటూ పరిస్థితులను బట్టి ఇంకా మున్మందు బడ్జెట్ తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక తగ్గింపులను, మిగిలిన విషయాలను అక్కడి ఆర్థిక శాఖ మంత్రి హిదేంశా నకమురా పర్యవేక్షించనున్నారు.
టోక్యో ఒలింపిక్ కమిటీ ఆ దేశ దగ్గర నుంచే 5.6 బిలియన్ డాలర్ల నిధులను అడగనుంది. 0.9బిలియన్ డాలర్ల వరకూ బయటనుంచి పెట్టే పెట్టుబడిదార్ల దగ్గరనుంచి వసూలు చేయనుంది. ఎంత తగ్గించుకున్నా టోక్యో ఒలింపిక్స్ నిర్వహక సంఘంపై 0.2బిలియన్ డాలర్ల అధిక భారం పడక తప్పట్లేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.