For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు.. ఖాతాలోకి మరో పతకం!

38వ జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఖాతాలో పదో పతకం వచ్చి చేరింది. ఈ క్రీడల్లో మంచిగానే రాణించిన తెలంగాణ టేబుల్‌ టెన్నిస్ (టీటీ) టీమ్ కు కంచు పతకం దక్కింది. పురుషుల‌ జట్టు ఈ కాంస్య పతకాన్ని అందుకుంది.

క్వార్టర్స్‌లో 3-2 తేడాతో ఉత్తర్‌ ప్రదేశ్‌పై విజయం సాధించిన తెలంగాణ జట్టు.. సెమీస్ లో మాత్రం ఓడిపోయింది. ఈ సెమీ ఫైనల్ లో మహారాష్ట్రపై 0-3 తేడాతో పరాజయం పాలవ్వడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ బ్రాంజ్ మెడల్ అందుకున్న టీమ్ లో అలీ మొహమ్మద్, సూరావజ్జుల స్నేహిత్, స్వర్ణేందు చౌధురీ, మొహమ్మద్‌ అలీ, సంతోష్‌ రమేశ్‌ కుమార్‌ ఉన్నారు.

Telangana table tennis mens team won bronze medal in 38th National games uttarkhand

తొలి రౌండ్ లో 6-11, 7-11, 9-11 తేడాతో జశ్‌ మోదీపై స్నేహిత్ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో 9-11, 9-11, 6-11 తేడాతో రీగన్‌ చేతిపై మొహమ్మద్‌ అలీ ... మూడో రౌండ్ లో 12-10, 1-11, 9-11, 3-11 తేడాతో చిన్మయ సోమయ్యపై స్వర్ణేందు చౌధురీ పరాజయం చెందారు.

మరో సెమీస్ లో తమిళనాడు జట్టు కూడా 2-3 తేడాతో వెస్ట్ బంగాల్ చేతిలో ఓడిపోయి కాంస్యాన్ని దక్కించుకుంది. సరిపెట్టుకుంది. ఇక తుది పోరులో వెస్ట్ బంగాల్ 3-0 తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల ఈవెంట్ లోనూ పశ్చిమ బంగాల్ జట్టే పసిడిని ముద్దాడింది.

Story first published: Tuesday, February 11, 2025, 9:54 [IST]
Other articles published on Feb 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+