
హైదరాబాద్: ఇండియన్ సైక్లింగ్ టీమ్కు ఊహించని షాక్ తగిలింది. స్విట్జర్లాండ్ వేదికగా ఆగస్టులో జరిగే జూనియర్ వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనాలని ఇండియన్ సైక్లింగ్ సభ్యులు వీసా కోసం దరఖాస్తు చేసుకోగా స్విస్ ఎంబసీ వీసా ఇచ్చేందుకు నిరాకరించింది.
స్విట్లర్లాండ్లో ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు జూనియర్ వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. దీంతో భారత్కు చెందిన అమర్ సింగ్, బిలాల్ అహ్మద్ డర్, గురుప్రీత్ సింగ్, మనోజ్ సాహు, నమన్ కపిల్, వెంకప్ప శివప్పలతో కూడిన సైక్లింగ్ టీమ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంది.
అయితే, వీరికి వీసా ఇచ్చేందుకు స్విస్ ఎంబసీ నిరాకరించింది. దీంతో సైక్లింగ్ ఫెడరేష్ ఆఫ్ ఇండియా, ఆసియా సైక్లింగ్ ఫెడరేషన్ సెక్రటరీ రంగంలోకి దిగి ఇండియన్ సైక్లింగ్ టీమ్కు వీసాలు ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు.