
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలిక వైద్యం నిమిత్తం తన కాంస్య పతకాన్ని వేలం వేయనుంది. ఆమె పక్కింట్లో నివసించే ఐదేళ్ల జుజియా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ప్రమాదకర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. ఈ పాపకు నిరంతర వైద్యం లేకపోతే ప్రాణానికే ప్రమాదం. అయితే కుటుంబసభ్యుల పేదరికంతో చిన్నారికి వైద్యం అందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పతకం గెలిస్తే, దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బుతో వైద్యం చేయిస్తానని తన అభిమాని అయిన జుజియాకు ఒలింపిక్స్ వెళ్లడానికి ముందే మాటిచ్చింది.
తన అభిమానికి మాట ఇచ్చిన విధంగా ఆమె మహిళల ఆర్ ఎస్-ఎక్స్ సెయిలింగ్ విభాగంలో కాంస్యం సాధించింది. దాన్ని వేలానికి పెట్టాలనే నిర్ణయం తీసుకుని అన్న మాటపై నిలబడడమే కాకుండా.. క్రీడా చరిత్రలో గొప్ప క్రీడాకారిణి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో పాటు మంచి మనసున్న మనిషిగా అందరి మన్ననలు అందుకుంటోంది.
తెలుగు వన్ఇండియా