
పాయింట్ల పట్టికలో ష్యాకు చెందిన అలెక్సీ క్లిమోవ్ 294 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగనున్న రెండో స్టేజ్ పోటీల్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న షూటర్లు ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఇక విజయ్ కుమార్ విషయానికి వస్తే 2010లో జరిగిన ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించండతో పాటు, అదే ఏడాది జరిగిన ఆసియా గేమ్స్లో ఒక కాంస్య పతకం సాధించాడు.
ఇది ఇలా ఉంటే ఒలింపిక్స్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న షూటర్ రంజన్ సోధి అభిమానుల ఆశలను నిరాశకు గురి చేశాడు. ఫైనల్స్కు చేరుకోవడంలో సోథీ విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మొత్తం 50 పాయింట్లకుగాను 48 పాయింట్లు చేసి, టాప్ స్థానంలో నిలిచినప్పటికీ.. తర్వాతి రెండు రౌండ్లలో 44, 42 పాయింట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో రంజన్ 150 పాయింట్లకు గాను 134 పాయింట్లు సాధించి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
షూటింగ్ అనంతరం సోది మాట్లాడుతూ ఇంతకు ముందెప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రదర్శన కనబర్చలేదని వాపోయాడు. నేనేమీ చెత్తగా షూట్ చేయలేదు. ఆఖరి రౌండ్లో డ్రాప్ షాట్స్ కూడా ఎక్కువగా లేవు. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వాటిని విశ్లేషించుకోవాలి. ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు. అయితే తొలి రౌండ్లో మెరుగ్గా ఆడా. అది అలాగే కొనసాగితే ఫైనల్స్కు వెళ్లేవాడ్ని అని సోధి వివరించాడు. 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సోధి ఒలింపిక్స్పై భారీ ఆశలు పెట్టుకున్న ఫైనల్స్కు చేరడంలో విఫలమయ్యాడు.
తెలుగు వన్ఇండియా