ఒలింపిక్స్లో పోటీ పడేవారందరూ ఫ్రొఫెషనల్ ఆటగాళ్లేనని, విజయం సాధించగలమనే నమ్మకం ఉండబట్టే ఒలింపిక్స్కు వెళుతున్నాం. కచ్చితంగా టెన్నిస్లో భారత్కు పతకాలు వస్తామని భావిస్తున్నాను. అన్ని విభాగాల్లో కలిపి ఏడుగురం వెళుతున్నాం. ఐదు లేక ఆరు పతకాలు వస్తాయనుకుంటున్నా' అని భూపతి స్పష్టం చేశాడు. టెన్నిస్ డబుల్స్ జట్టు ఎంపిక విషయంలో లియాండర్ పేస్తో కలిసి ఆడేది లేదని భూపతి, బోపన్నా తేల్చి చెప్పడంతో ఈసారి లండన్ ఒలంపిక్స్కు రెండు డబుల్స్ జట్లను పంపుతున్నారు.
దీంతో ప్రపంచపు టాప్టెన్లో ర్యాంక్ కలిగిన లియాండర్ పేస్కు జోడీగా హైదరాబాద్కు చెందిన విష్టువర్దన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గత ఏడు నెలల నుంచి ఒలింపిక్స్ కోసం బోపన్నతో కలిసి భూపతి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతర్జాతీయ స్టార్ టెన్నిస్ ఆటగాళ్లైన ఫెదరర్, నాదల్, ముర్రే, జొకోవిచ్, బ్రయాన్ బ్రదర్స్ రంగంలో ఉన్న ఈ మెగా ఈవెంట్లో మేము గట్టి పోటీనే ఎదుర్కొంటామని భూపతి అన్నాడు.
తెలుగు వన్ఇండియా