పోలీసు విచారణాధికారి హిల్టన్ బోథ్ కోర్టులో మాట్లాడుతూ.. సంఘటన జరిగిన రోజు వేకువజామునే ఇద్దరు, ముగ్గురు గొడవపడినట్లుగా తాము విన్నామని కొందరు చెప్పారని అన్నారు. రీవా హత్య ఘటనకు ముందు ఈ గొడవ తాము విన్నామని చెబుతున్నారన్నారు.
29 ఏళ్ల రీవా పైన మూడుసార్లు కాల్పులు జరిగాయని, మృతురాలు మోచేయి తదితర ప్రాంతాల్లో గాయాలు ఉన్నాయని చెప్పారు. తుపాకీ గుళ్లు నేరుగా స్నానపు గది తలుపులను తాకినట్లుగా లేవని, బేసిన్, టాయిలెట్ లక్ష్యంగా కాల్చినట్లుగా తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, ఫిబ్రవరి 14న ప్రియుడి చేతిలో మృతి చెందిన రీవా ప్రేమికుల దినోత్సవం రోజు ట్విట్టర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ప్రేమ కోసం ఈ రోజు మీరెలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారని ట్వీట్ చేసింది. అదే రోజు పిస్టోరియస్ను ఆటపట్టించబోయి హత్య గావించబడింది.