ఇది ఇలా ఉంటే భారత మరో బాక్సర్ జై భగవాన్ ఒలింపిక్స్ నుండి నిష్క్రమించాడు. పురుషుల లైట్ వెయిట్ (60 కిలోల) విభాగంలో గురువారం నాడు జరిగిన ఫ్రీక్వార్టర్స్ మ్యాచ్లో కజకిస్తాన్కు చెందిన గని జాయ్వోవ్తో ఢీ కొన్న జై భగవాన్ 8-16 తేడాతో పరాజయం పాలయ్యాడు. మార్చిన జైలవోవ్ ఎదురుదాడికి దిగాడు. దీంతో రెండో రౌండ్ ముగిసేసరికి 10-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. దీంతో రెండు రౌండ్ పూర్తయ్యేసరికి జైలవోవ్ భారత బాక్సర్ జై భగవాన్పై 12-6 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు.
ఇందులో మూడు పెనాల్టీ పాయింట్లు ఉన్నాయి. భారత బాక్సర్ అదే పనిగా తలను దాచుకోవడంతో రిఫరీ పెనాల్టీ విధించారు. ఇక చివరి రౌండ్లో భారీ తేడాతో ఓడిన భగావాన్ దాదాపుగా తన ఓటిమిని ముందే అంచనా వేసుకున్నాడు. భగవాన్ మూడో రౌండ్ను సైతం 4-2 తేడాతో కోల్పోయి మొత్తంగా 16-8 తేడాతో పరాజయం పాలయ్యాడు.
తెలుగు వన్ఇండియా