న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాక్సింగ్: జై భగవాన్ ఇంటికి, విజేందర్ క్వార్టర్ ఫైనల్స్‌లో

By Nageswara Rao
Olympics 2012: Boxer Vijender enters quarters in 75kg
లండన్, ఆగస్టు 3: బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ లండన్ ఒలింపిక్స్‌లో మరో విజయాన్ని నమోదు చేశాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన 75 కిలోల ప్రీ-క్వార్టర్‌ ఫైనల్‌ ఫైట్‌లో అమెరికా బాక్సర్‌ టెరెల్‌ గాషాను విజేందర్ ఓడించాడు. అభిమానులకు ఈ మ్యాచ్ మంచి వినోదాన్ని పంచింది. మొత్తం మూడు రౌండ్లు జరిగిన ఈ ఫైట్‌లో భారత బాక్సర్ విజేందర్ 16-15 పాయింట్లతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్తు సాధించాడు.

ఇది ఇలా ఉంటే భారత మరో బాక్సర్ జై భగవాన్ ఒలింపిక్స్ నుండి నిష్క్రమించాడు. పురుషుల లైట్‌ వెయిట్‌ (60 కిలోల) విభాగంలో గురువారం నాడు జరిగిన ఫ్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌కు చెందిన గని జాయ్‌వోవ్‌తో ఢీ కొన్న జై భగవాన్‌ 8-16 తేడాతో పరాజయం పాలయ్యాడు. మార్చిన జైలవోవ్ ఎదురుదాడికి దిగాడు. దీంతో రెండో రౌండ్ ముగిసేసరికి 10-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. దీంతో రెండు రౌండ్‌ పూర్తయ్యేసరికి జైలవోవ్ భారత బాక్సర్‌ జై భగవాన్‌పై 12-6 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు.

ఇందులో మూడు పెనాల్టీ పాయింట్లు ఉన్నాయి. భారత బాక్సర్ అదే పనిగా తలను దాచుకోవడంతో రిఫరీ పెనాల్టీ విధించారు. ఇక చివరి రౌండ్‌లో భారీ తేడాతో ఓడిన భగావాన్‌ దాదాపుగా తన ఓటిమిని ముందే అంచనా వేసుకున్నాడు. భగవాన్‌ మూడో రౌండ్‌ను సైతం 4-2 తేడాతో కోల్పోయి మొత్తంగా 16-8 తేడాతో పరాజయం పాలయ్యాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X