
2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ను షరపోవా రెండు సెట్లలోనే ముగించాల్సింది. స్కోరు 6-1, 4-4తో ఉన్నదశలో వర్షం రావడంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. 73 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ కొనసాగింది. పెత్రోవా రెండు గేమ్లను నెగ్గి రెండో సెట్ను సాధించింది. ఆ తర్వాత మూడో సెట్లో 2-0తో విజయం సాధించింది.
ఇక మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో మహేశ్ భూపతి (భారత్)-హలవకోవా (చెక్ రిపబ్లిక్) జోడి తమ ప్రత్యర్థికి 'వాకోవర్' ఇచ్చింది. లియాండర్ పేస్ (భారత్)-వెస్నినా (రష్యా) జోడి మూడో రౌండ్లో 4-6, 6-4, 10-5తో అబిగెల్ స్పియర్స్-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్లో మూడో రౌండ్లో ఓడిపోయినా.. మిక్స్డ్ డబుల్స్లో మాత్రం క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. సానియా-బెథానీ మాటెక్ (అమెరికా) జోడి 4-6, 7-6 (9/7), 3-6తో రెండో సీడ్ సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా-కొలిన్ ఫ్లెమింగ్ (బ్రిటన్) జంట 6-4, 7-6 (9/7)తో మెలానీ ఉడిన్-జాక్ సాక్ (అమెరికా) జోడిపై గెలిచింది.
తెలుగు వన్ఇండియా