ఢిల్లీ స్మాషర్స్కు చెందిన గుత్తా జ్వాల, పుణే పిస్టన్స్కు చెందిన అశ్విని పొన్నప్పలు గురువారం ఉదయం లక్నో విమానం ఎక్కడం కోసం హడావుడిగా పరుగులు తీశారు. వారు అంతకుముందు కేవలం రెండు గంటలే నిద్రపోయారు. బుధవారం తొలి రోజు సిరిఫోర్ట్ స్పోర్ట్స్ సముదాయంలో నిర్ణయాత్మక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది.
షట్లర్లు తాము బస చేసిన హోటల్ను ఉదయం ఏడు గంటలకే ఖాళీ చేయాల్సి వచ్చింది. తమ మ్యాచ్ పూర్తయ్యేసరికి ఆలస్యమైందని, ఉదయం ఏడు గంటలకే హడావుడిగా హోటల్ ఖాళీ చేసి లక్నో విమానం ఎక్కాల్సి వచ్చిందని గుత్తా జ్వాల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రయాణ ఏర్పాట్లపై కలత చెందానని, విశ్రాంతి తీసుకోవడానికి కూడా తమకు సమయమే ఉండటం లేదని అశ్విని పొన్నప్ప చెప్పారు. కాగా ఐబిఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సైనా నెహ్వాల్ - పివి సింధుల మధ్య జరిగిన మ్యాచులో సైనా గెలుపొందింది.