న్యూఢిల్లీ: ఈ సంవత్సరం లండన్ లో జరిగే ఒలంపిక్స్ 2012ని బహిస్కరించాలని భారత్ ఆలోచనలో ఉంది. ఇందుకు కారణం భోపాల్ దుర్ఘటనకు కారణమైన డౌ కెమికల్స్ లండన్ ఒలింపిక్స్ ను స్పాన్సర్ చేస్తుండడమే. భారత్ లండన్ ఒలంపిక్స్ ని బహిస్కరిస్తుందని వస్తున్న వార్తలపై ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ పెదవి విప్పారు. లండన్ ఒలింపిక్స్ ను భారత్ బహిష్కరిస్తే అది తమను తీవ్రంగా బాధిస్తుందని అన్నారు.ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడల్ని వ్యాపారంగానో, రాజకీయంగానో వాడుకోవడం చాలా దురదృష్టమన్నారు. భోపాల్ ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్పాన్సర్ల ఒప్పందాలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జరుగుతాయి. ఇందులో మేం చేయగలిగిందేమీ లేదు. ఏమైనా అభ్యంతరాలుంటే నేరుగా అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ తో తేల్చుకోవాలి. అంతేగానీ బహిష్కరించడం తగదు. ఈ విషయంలో నేను చేయగలిగింది చేశాను. మా వాళ్లు భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నారు. అలాగే వాళ్లు లండన్ కు వస్తారనే భావిస్తున్నా అని ఇంగ్లండ్ ప్రధాని చెప్పారు. ఇది ఇలా ఉంటే లండన్ ఒలంపిక్స్ కి ఇండియన్ హాకీ హార్హత సాధించిన విషయం తెలిసిందే. #13;