ఇండోర్: దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ బౌలింగ్ కోచ్ వ్యాఖ్యలను నిజం చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ లాంగ్వెల్ట్ వారికి రెండో వన్డేకు ముందు ఓ సూచన చేశాడు. తొలి ట్వంటీ 20లో రోహిత్ శర్మ బ్యాట్తో అదరగొట్టాడు. ధర్మశాలలో జరిగిన ఆ మ్యాచ్లో 79 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 106 పరుగులు చేశాడు.
మూడు రోజుల క్రితం కాన్పూర్లో జరిగిన తొలి వన్డేలో 133 బంతుల్లో 150 పరుగులు చేశాడు. దీంతో, ఆయన రోహిత్ శర్మను టార్గెట్ ప్రధానంగా టార్గెట్ చేసుకోవాలని బౌలర్లకు సూచించాడు. రోహిత్ శర్మను తొలి పది బంతుల్లోనే పెవిలియన్ చేర్చాలని భావించాడు.

ఇందుకోసం తమ బౌలర్లకు అతడు పలు సూచనలు చేసినట్లుగా కనిపిస్తోంది. బౌలింగ్ కోచ్ మాట ప్రకారం.. సౌతాఫ్రికా బౌలర్లు తొలి పది బంతుల్లోనే రోహిత్ శర్మను బుధవారం నాటి ఆటలో పెవిలియన్ చేశారు. రోహిత్ తొమ్మిది బంతుల్లో మూడు పరుగులు చేశాడు. ఆ తర్వాత పదో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రోహిత్ శర్మను రబడ అవుట్ చేశాడు. మ్యాచ్కు ముందు సౌతాప్రికా బౌలింగ్ కోచ్ మాట్లాడుతూ... రోహిత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని, అతను మంచి ఆటగాడని, అతనిని పెవిలియన్ పంపించేందుకు తమకు తొలి పది బంతులు ముఖ్యమని చెప్పాడు. అతనిని మేం తొలి పది బంతుల్లోనే ఔట్ చేయాలన్నాడు.