For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి టెస్టులో భారత్ పై సౌతాఫ్రికా గెలుపు: సచిన్ సెంచరీ వృధా

By Srinivas
South Africa
సెంచూరియన్: అనుకున్నదే జరిగింది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ ఓడిపోయింది. భారత్ 25 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవి చూసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చివరి వరకు పోరాడినప్పటికీ ఓటమి భారినుండి భారత్ తప్పించుకోలేక పోయింది. సచిన్ టెండుల్కర్ 111 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ముందంజలో ఉంది.

టెస్టు మొదటి ఇన్నింగ్సులోనే మనం తడబడిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్సులో భారత్ కేవలం 136 పరుగులు మాత్రమే చేసింది. అందుకు దక్షిణాఫ్రికా ధీటాగానే ఆడి 620 పరుగులకు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి డిక్లేర్ చేసింది. అనంతరం ఓటమినుండి తప్పించుకొని డ్రా చేయడానికి భారత్ ఎదురొడ్డాల్సి వచ్చింది. అయినా ఫలితం లేక పోయింది. టెస్టు హీరోలు ద్రావిడ్, లక్ష్మణ్ లు బాగా ఆడకపోవటం మన ఓటమికి కారణం. లక్ష్మణ్ 8 పరుగులకు, ద్రావిడ్ 43 పరుగులకే రెండో ఇన్నింగ్సులో అవుటయ్యారు. ఇది భారత్ ను తీవ్రంగా దెబ్బతీసింది. వికెట్ల వద్ద పాతుకుపోయే వీరి వికెట్లు కోల్పోగానే భారత్ అపజయం ఖాయంగా కనిపించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+