జోహెన్నెస్ బర్గ్: పన్నును తప్పించుకోవడానికి ఇప్పటికీ ఇండియాలోనే ఉండిపోయిన దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పై స్వదేశంలో మండిపడుతున్నారు. క్వార్టర్ ఫైనల్ లో తమ జట్టు ఓడిపోయిన తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి రాకండా ఇండియాలోనే ఉండిపోయాడు. ఆదాయం పన్నును ఎగవేసేందుకే భారత్ లో ఉండిపోయాడనే విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి స్మిత్ తప్పుకుంటున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ పాప్ స్టార్ మోర్గాన్ డీనేను చూడడానికి ఐర్లాండులో ఉన్నాడు. స్వదేశానికి తిరిగి వస్తే ఎదురయ్యే విమర్సల నుంచి తప్పించుకోవడానికి ఇండియాలోనే ఉండిపోవాలని ఆమె స్మిత్ కు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆదాయం పన్ను చెల్లింపును తప్పించుకోవడానికి జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న స్మిత్ ఇండియాలోనే ఉండిపోయాడని అతని జట్టు సహచరుడు ఫాఫ్ డు ప్లెసిస్ రేడియో స్టేషన్ లో చెప్పాడు. దాంతో వివాదం ప్రారంభమైంది. కనీసం 183 రోజుల పాటు, ఇందులో వరుసగా 60 రోజుల పాటు విదేశాల్లో ఉంటే పన్ను చెల్లింపులో దక్షిణాఫ్రికన్లకు పన్ను చెల్లింపులో మినహాయింపు లభిస్తుంది. ప్రపంచ కప్ పోటీలు ముగిసిన తర్వాత కూడా ఐపియల్ లో ఆడేందుకు స్మిత్ భారత్ లోనే ఉండడం ద్వారా స్మిత్ కు ఆ మినహాయింపు లభించే అవకాశం ఉంది.