
జకార్తా: ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడా సంరంభంలో భారత్కు రజతాల వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం జరిగిన స్టీపుల్ చేజ్ మహిళల విభాగంలో సుధా సింగ్ సిల్వర్ సొంతం చేసుకుంది. 3000.మీ పరుగుపందెంలో నిర్దేశించిన బార్లపై నుంచి దూకుతూ.. బహ్రెయిన్ క్రీడాకారిణి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. 9:40.03 సమయంలో పూర్తి చేసిన ఆమె విజేతగా నిలిచింది.
మరో భారత్ క్రీడాకారిణి చింత 10:26.21 సమయంలో పరుగును పూర్తి చేసి పదకొండో స్థానంలో నిలిచింది. దీంతో భారత్కు 39పతకాలు దక్కాయి. వాటిలో ఏడు స్వర్ణాలు, 12 రజతాలు, 20 కాంస్యాలు ఉన్నాయి.