బీజింగ్: తెలుగు క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ బీజింగ్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ లో రెండో రౌండ్ లో ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ శరత్ కమల్ ఆస్ట్రేలియా క్రీడాకారుడు చెన్ వీగ్జింగ్ పై 1-4 స్కోరుతో ఓడిపోయాడు. బుధవారం జరిగిన పోటీలో చెన్ పై 5-11, 12-14, 2-11,11-8, 10-12 స్కోరుతో ఓటమి పాలయ్యాడు. చెన్ శరత్ కమల్ పై దాడికి దిగాడు. ఆ ఒత్తిడిని కమల్ తట్టుకోలేకపోయాడు. 32 నిమిషాల పాటు సాగిన మ్యాచులో ఒక సెట్ లో మాత్రమే కమల్ విజయం సాధించాడు. టేబుల్స్ టెన్నిస్ మహిళా సింగిల్స్ భారత క్రీడాకారిణి నేహా అగర్వాల్ సోమవారం తొలి రౌండులోనే ఓడిపోయింది.