బీజింగ్: బీజింగ్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్ లో తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. స్పెయిన్ కు చెందిన అల్ఫ్ఫెడో కార్నెరోస్ ను 4-2 స్కోరుతో తొలి రౌండులో శరత్ కమల్ ఓడించాడు. తొలి సెట్టులో 6-11తో కోల్పోయిన శరత్ కమల్ ఆ తర్వాతి సెట్లలో 12-10, 11-8 స్కోరుతో గెలుపొందాడు. ఆ తర్వాతి సెట్టును 9-11 స్కోరుతో కోల్పోయాడు. ఆ తర్వాత 11-6, 11-7 స్కోర్లతో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య పోరు 45 నిమిషాల పాటు సాగింది. గతంలో కార్నెరోస్ పై పోరాడి ఓడిన శరత్ కమల్ ఒలింపిక్స్ లో మాత్రం పైచేయి సాధించాడు. ఒకరి బలాబలాలు మరొకరికి సంపూర్ణంగా తెలియడంతో కార్నెరోస్ పై విజయం సాధించడం శరత్ కమల్ కు అంత సులభం కాలేదు.