ముంబై: బాలీవుడ్ బాద్షా, కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఝలక్ ఇచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో విదేశీ మారకద్రవ్యం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడి ఆ సమన్లు జారీ చేసింది.

ఈ నెలాఖరులో తమ ముందు హాజరు కావాలని ఈడి ఆయనను ఆదేశించింది. విచారణ నిమిత్తమే షారూక్ ఖాన్కు ఈడి ఆ సమన్లు జారీ చేసింది.
ఇటువంటి విషయం మీదనే ఈడి 49 ఏళ్ల షారూక్ ఖాన్ను నాలుగేళ్ల క్రితం ముంబైలో విచారించింది.