న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో స్వర్ణం, మొత్తం మూడు పతకాలు

Sanjita Chanu wins 2nd gold medal for India at CWG 2018

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ మరో స్వర్ణాన్ని వరించింది. శుక్రవారం జరిగిన పోటీలలో భారత మరో క్రీడాకారిణి మహిళల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీపడింది. మొత్తం 192 కేజీలు ఎత్తి భారత్‌కి పసిడి పతకాన్ని అందించింది. స్నాచ్‌లో గరిష్ఠంగా 84 కిలోలు ఎత్తిన సంజితా చాను.. క్లీన్ అండ్ జెర్క్‌లో 108 కిలోలు ఎత్తింది.

క్లీన్ అండ్ జెర్క్‌ మూడో ప్రయత్నంలో 112 కేజీలు ఎత్తడంలో కాస్త తడబడినా తొలి రెండు అటెంప్ట్‌లలో 104 కిలోలను, 108 కేజీలను ఎత్తడంతో పసిడి ఖాయమైంది. అయితే.. దీంతో.. 108కేజీలతో పాటు 84కేజీలు కలిపి 192కేజీలతో ఆమె స్వర్ణాన్ని వరించినట్లే.. చానుకి, రజత పతక విజేతకి 12 కిలోల అంతరం ఉంది.

తాజా పతకంతో.. కామన్వెల్త్ 2018లో భారత్ పతకాల సంఖ్య మూడుకి చేరింది. ఒకవేళ.. సంజితా చాను కూడా క్లీన్ అండ్ జర్క్ మూడో ప్రయత్నంలో 112 కేజీలు ఎత్తి ఉంటే.. వ్యక్తిగత విభాగంలో మీరాబాయి చాను గురువారం నెలకొల్పిన కామన్వెల్త్ రికార్డుని సమం చేసేది.

ఇది మూడోది:
వెయిట్ లిఫ్టింగ్‌లో గురువారం కూడా భారత్‌కి రెండు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను మొత్తం 196 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుపొందగా.. పురుషుల 56 కేజీల విభాగంలో పోటీపడిన గురురాజా రజతం సాధించాడు.

Story first published: Friday, April 6, 2018, 9:28 [IST]
Other articles published on Apr 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X