
హైదరాబాద్: ప్రొ రెజ్లింగ్ లీగ్లో భాగంగా మంగళవారం ముంబై, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో ఢిల్లీతో హోరాహోరీగా తలపడి ముంబై మహారథి శుభారంభం చేసింది. ముంబై 5-2తో ఢిల్లీ సుల్తాన్స్పై విజయం సాధించింది.
ముంబై కెప్టెన్ సాక్షి మాలిక్ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఐదు బౌట్లు ముగిసే సరికి ముంబై 3-2తో ఆధిక్యంలో నిలిచింది. ఆరో బౌట్లో సాక్షి (62కేజీ) ఢిల్లీ తరపున ఆడిన 18-2తో మోనియా గెలవడంతో ద్వారా జట్టుకు విజయాన్ని ఖరారు చేసింది.
ఢిల్లీకి ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచిన సాక్షి మాలిక్ ఢిల్లీ కెప్టెన్, స్టార్ ఆటగాడు సుశీల్ను బ్లాక్ చేశింది. దీంతో అతడు పోటీకి దూరమయ్యాడు. 62 కేజీల విభాగంలో ఆడిన సాక్షి 10-2 లీడ్తో మొదలుపెట్టి 18-2 ను గెలుచుకుంది.
RESULTS
Mumbai Maharathi bt Delhi Sultans 5-2
Andrey Yatsenko lost to Sandeep Tomar 9-14
Seema beat Maroi Mezien 5-1
Satyawart Kadian lost to Alborov Aslan 0-15
Cynthia Vescan bt Samaramer Hamza 12-1
Satender Malik beat Hitender 7-6
Sakshi Malik beat Monia 18-2
Soslav Ramonov bt Haji Aliev 3-2
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.