ఇందులో తమపై విధించిన నిషేధాన్ని నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. నిషేధంపై రుసాడ అప్పీల్ చేయడంతో ఈ విషయం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు చేరనుంది. దీనిపై రుసాడా డైరెక్టర్ యూరీ గనస్ మాట్లాడుతూ "ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను వాడాకు సమర్పించాం. ఆంక్షలను విభేదిస్తున్నామని అందులో పేర్కొన్నాం" అని అన్నారు.
నిన్న కనేరియా వివక్ష... నేడు వసీం అక్రమ్ వీడియో: షోయబ్ అక్తర్ మరో దుమారం
2020 టోక్యో ఒలింపిక్స్, 2022 వింటర్ ఒలింపిక్స్ సహా మరే ప్రపంచపోటీల్లో పాల్గొనకుండా రష్యాపై వాడా నాలుగేళ్లు నిషేధం విధించింది. డోపింగ్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇచ్చినందుకు వాడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
క్రిష్ శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలకు సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనను ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. 2011-15 కాలంలో ప్రభుత్వమే డోపింగ్ను ప్రోత్సహించిందని మెక్లారెన్ స్వతంత్ర నివేదిక 2016లో బయటపెట్టిన సంగతి తెలిసిందే.