
నర్సింగ్ యాదవ్
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో రెజ్లర్ నర్సింగ్యాదవ్ విఫలమైన విషయం తెలిసిందే.

నర్సింగ్ యాదవ్
అతడి నుంచి తీసుకున్న 'ఏ' నమూనాతో పాటూ 'బి' నమూనాలోనూ నిషేధిత మిథేనడైనన్ అనే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ పరీక్షల అనంతరం తేల్చి చెప్పారు.

నర్సింగ్ యాదవ్
మరోవైపు, తనపై కుట్ర జరిగిందని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. తాను ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకోలేదని స్పష్టం చేశాడు.

నర్సింగ్ యాదవ్
తాను బాగానే పర్ఫార్మ్ చేస్తున్నట్లు చెప్పిన రెజ్లర్ తనకు నిషేధిత ఉత్ర్పేరకాలు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఆహారంలో కానీ నీటిలో కానీ ఎవరో ఏదైనా కలిపి ఇచ్చి ఉంటారని నర్సింగ్ మొదటి నుంచి చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications